Chiranjeevi: పద్మ విభూషణ్ గ్రహీతలకు కేంద్ర హోం శాఖ విందు... కుటుంబసభ్యులతో హాజరైన మెగాస్టార్ చిరంజీవి

  • ఈ ఏడాది వెంకయ్యనాయుడుతో పాటు పద్మ విభూషణ్ కు ఎంపికైన చిరంజీవి
  • నేడు అవార్డు స్వీకరించిన మెగాస్టార్
  • పద్మ విభూషణ్ విజేతల గౌరవార్థం విందు ఏర్పాటు చేసిన అమిత్ షా
Chiranjeevi attends Central Home Ministry dinner in New Delhi

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేడు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా పద్మ విభూషణ్ విజేతల గౌరవార్థం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు చిరంజీవి కుటుంబ సభ్యుల సహా హాజరయ్యారు. చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, సుస్మిత ఈ విందుకు తరలివచ్చారు.

కేంద్రం ఈ ఏడాది మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించింది. ఇటీవల అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగినా, ఆ కార్యక్రమానికి చిరంజీవి హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఇవాళ చిరంజీవికి అవార్డు ప్రదాన కార్యక్రమం నిర్వహించింది.

  • Loading...

More Telugu News